England : భారత పర్యటనను విజయంతో ఆరంభించిన ఇంగ్లండ్(England) రెండో టెస్టులో తేలిపోయింది. వైజాగ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో సమిష్టి వైఫల్యంతో వెనకబడింది. ఉప్పల్ టెస్టు(Uppal Test) రెండో ఇన్నింగ్స్లో అద్భుత పోరాటంతో టీమిండియాకు షాకిచ్చిన ఇంగ్లీష్ జట్టు ఈసారి ఏం చేస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే.. వైజాగ్ టెస్టు ముగిశాక బెన్ స్టోక్స్ సేన బ్రేక్ తీసుకోనుంది. మూడో టెస్టుకు 9 రోజుల విరామం ఉండడంతో అబూదాబీకి వెళ్లనుంది.
అక్కడ ఇంగ్లండ్ క్రికెటర్లు తమ కుటుంబ సభ్యులతో గడపనున్నారు. ఇంగ్లండ్ జట్టు అబుదాబీ టూర్ విషయాన్ని ఆదేశ క్రికెట్ బోర్డు త్వరలోనే అధికారికంగా వెల్లడించనుందిభారత పర్యటనకు ముందు స్టోక్స్ బృందం అబుదాబీలోనే ప్రత్యేక క్యాంప్లో పాల్గొన్న విషయం తెలిసిందే. మూడో టెస్టు ఫిబ్రవరి 15న రాజ్కోట్లో జరుగనుంది. తొలి రెండు టెస్టులకు దూరమైన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్తో బరిలోకి దిగనున్నాడు.
యశస్వీ జైస్వాల్(209, 15 నాటౌట్)
తొలి టెస్టు విజయంతో వైజాగ్ వచ్చిన ఇంగ్లండ్.. యశస్వీ సూపర్ సెంచరీతో తొలి రోజే డీలా పడిపోయింది. ఆ తర్వాత స్పీడ్స్టర్ బుమ్రా ధాటికి 253 రన్స్కే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్ జాక్ క్రాలే(76) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ బెన్ స్టోక్స్(47), తొలి టెస్టు హీరో ఓలీ పోప్(23)లు ఫర్వాలేదనిపించారు. కీలకమైన మూడో రోజు ఇంగ్లండ్ బౌలర్లు ఏ మేరకు రాణిస్తారు అనేది చూడాలి. భారత్ 171 పరుగుల ఆధిక్యలో ఉంది. డబుల్ సెంచరీ హీరో యశస్వీ జైస్వాల్(15 నాటౌట్), రోహిత్ శర్మ(13 నాటౌట్) మూడో రోజు ధాటిగా ఆడితే టీమిండియాకు తిరుగులేనట్టే.