ముంబై : ఇండియా-ఏతో జరిగిన టీ20 సిరీస్ను ఇంగ్లండ్-ఎ 2-1తో గెలుచుకున్నది. ఆదివారం జరిగిన మూడో మ్యాచ్లో ఆల్రౌండర్ ఇస్సీ వాంగ్ ప్రతిభతో ఇంగ్లండ్ జట్టు రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత ఇండియా-ఎ 19.2 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటయింది.
ఉమా చెత్రి (21) టాప్ స్కోరర్. ఇస్సి వాంగ్ 18 పరుగులకు 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం ఇంగ్లండ్-ఎ 19.1 ఓవర్లలో 8 వికెట్లకు 104 పరుగులు చేసి విజయాన్నందుకుంది.