ఇంగ్లండ్తో టీ20 సిరీస్ను ఓటమితో ముగించిన టీమిండియా.. వన్డే సిరీస్ను విజయంతో ప్రారంభించాలని ఉవ్విళ్లూరుతోంది. అదే సమయంలో టీ20లో మిస్సయిన కీలక ఆటగాళ్లంతా జట్టుతో కలుస్తుండటంతో ఇంగ్లండ్ మరింత బలంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ.. తొలి వన్డేకు దూరమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గజ్జల్లో గాయం కారణంగా కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తొలి వన్డే ముందు ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ సెషన్స్లో కూడా కోహ్లీ పాల్గొనలేదట. మంగళవారం నాడు లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ఇంగ్లండ్, భారత్ తొలి వన్డే జరగనున్న సంగతి తెలిసిందే.
Virat Kohli did not come for optional practice today ahead of the first ODI match at Kennington Oval. He has a suspected groin injury and is unlikely to play the first ODI against England: BCCI sources
— ANI (@ANI) July 11, 2022