ఇంగ్లండ్తో జరిగిన మూడో టీ20లో భారత జట్టు ఓటమిపాలైంది. ట్రెంట్బ్రిడ్జ్లో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 215/7 స్కోరు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా టాపార్డర్ విఫలమైంది. రిషభ్ పంత్ (1), రోహిత్ (11), కోహ్లీ (11) పరుగులు మాత్రమే చెయ్యగలిగారు.
ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (28)తో కలిసి సూర్యకుమార్ యాదవ్ (117) జట్టును గెలిపించేందుకు ప్రయత్నించాడు. అయితే అయ్యర్ అవుటైన తర్వాత దినేష్ కార్తీక్ (6), రవీంద్ర జడేజా (7) వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో ఒత్తిడి పెరిగింది. ఇలాంటి సమంయలో మొయీన్ అలీ బౌలింగ్లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన సూర్యకుమార్ కూడా అవుటయ్యాడు.
జోర్డాన్ వేసిన చివరి ఓవర్లో హర్షల్ పటేల్ (5), రవి బిష్ణోయి (2) కూడా అవుటయ్యారు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యే సరికి 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చెయ్యగలిగింది. ఇంగ్లండ్ జట్టు 17 పరుగుల తేడాతో విజయం సాధించి పరువు నిలుపుకుంది.
ఇంగ్లండ్ బౌలర్లలో టాప్లే మూడు వికెట్లతో చెలరేగగా.. డేవిడ్ విల్లే, క్రిస్ జోర్డాన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. మొయీన్ అలీ, రిచర్డ్ గ్లీసన్ తలో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. మూడు మ్యాచుల సిరీస్లో తొలి రెండు మ్యాచులు నెగ్గిన భారత్.. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
Jordan finishes it in style 😎
England beat India in the third T20I by 17 runs 🚨
🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/wyFNlcA3aw
— Sky Sports Cricket (@SkyCricket) July 10, 2022