ముంబై: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ శివమ్ దూబే దూకుడుగా ఆడుతున్నాడు. గత సీజన్ వరకు బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన దూబేను ఈ ఏడాది ఆ ఫ్రాంఛైజీ వేలంలోకి విడిచిపెట్టింది. యువ ఆటగాడిని రాజస్థాన్ కొనుగోలు చేసింది. సీజన్లో ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ల్లో విఫలమైన దూబే బెంగళూరుతో పోరులో మాత్రం దుమ్మురేపుతున్నాడు.
43/4తో కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకుంటున్నాడు. ముఖ్యంగా చాహల్ వేసిన 9వ ఓవర్లో రెండు సిక్సర్లు, ఫోర్ బాది 17 రన్స్ రాబట్టాడు. దూబే(40), రియాన్ పరాగ్(21) ధనాధన్ బ్యాటింగ్తో అలరిస్తుండటంతో 13 ఓవర్లలోనే 100 మార్క్ దాటింది. 13 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ 4 వికెట్లకు 104 పరుగులు చేసింది.