బాలీవుడ్ మీడియాలో జాన్వీకపూర్ చర్చనీయాంశమైంది. ఆమె నటిస్తున్న ‘మిస్టర్ అడ్ మిసెస్ మహి’ సినిమానే ఈ చర్చకు కారణం. వివరాల్లోకెళ్తే.. ఈ సినిమాలో జాన్వీకపూర్ హౌస్వైఫ్గా నటిస్తుంటే, భర్తగా విభిన్నమైన పాత్రలో రాజ్కుమార్రావు కనిపించనున్నారు. భార్యాభర్తల బంధం నేపథ్యంతోపాటు క్రీడా నేపథ్యంలో కూడా ఈ సినిమా సాగుతుందని సమాచారం. అయితే.. కథ డిమాండ్ మేరకు ఇందులో ఓ శృంగార సన్నివేశం తప్పనిసరి అయ్యిందట.
దాంతో దర్శకుడు శరన్శర్మ ఆ సన్నివేశాన్ని జాన్వీకి వివరిస్తే, ఆమె ససేమిరా అన్నదట. దర్శకుడు నచ్చజెప్పడంతో జాన్వీకి తప్పలేదట. దీనిపై ముంబయ్ మీడియాలో రకరకాలుగా కథనాలు ప్రసారమయ్యాయి. వీటిపై జాన్వీ స్పందిస్తూ ‘కథకు ఆ సన్నివేశం అవసరం. రోల్ డిమాండ్ మేరకే నటించాను. ఎక్కడా అసభ్యత లేకుండా కళాత్మకంగా శరన్శర్మ ఆ సన్నివేశాన్ని తీర్చిదిద్దారు. భార్యాభర్తల ప్రేమ మాత్రమే అందులో కనిపిస్తుంది. నటిగా ఈ సినిమా నాకు ఛాలెంజ్.’ అని చెప్పింది. ఈ నెల 31న ఈ సినిమా విడుదల కానుంది.