న్యూఢిల్లీ: ఫాంటసీ గేమింగ్ కంపెనీ డ్రీమ్11(Dream11) .. భారతీయ క్రికెట్ జట్టుకు రానున్న మూడేళ్ల పాటు లీడింగ్ స్పాన్సర్గా వ్యవహరించనున్నది. బీసీసీఐ ఇవాళ దీనిపై ప్రకటన చేసింది. వెస్టిండీస్తో జరిగే సిరీస్ నుంచి భారతీయ క్రికెటర్ల జెర్సీలపై డ్రీమ్11 లోగో ఉండనున్నది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ 2023-25లో భాగంగా ఇండియా తన తొలి టెస్టు సిరీస్ను ఆడనున్న విషయం తెలిసిందే. అయితే డ్రీమ్11తో జరిగిన ఫైనాన్షియల్ ఒప్పందం గురించి బీసీసీఐ పూర్తి వివరాలను వెల్లడించలేదు. బైజూస్ స్థానంలో డ్రీమ్11 స్పాన్సర్ చేయనున్నది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బెన్నీ.. డ్రీమ్11కు కంగ్రాట్స్ తెలిపారు.
🚨 NEWS 🚨: BCCI announces Dream11 as the new #TeamIndia Lead Sponsor.
More Details 🔽https://t.co/fsKM7sf5C8
— BCCI (@BCCI) July 1, 2023
గతంలో అఫిషియల్ స్పాన్సర్గా ఉన్న డ్రీమ్11 ఇప్పుడు లీడింగ్ స్పాన్సర్గా మారింది. ఇటీవల కిట్ స్పాన్సర్గా అడిడాస్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. మార్చి 2028 వరకు ఆ డీల్ ఉంటుంది.