Manu Bhaker | పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024)లో సంచలనం సృష్టించిన షూటర్ (shooter) మను బాకర్ (Manu Bhaker) భారత్ చేరుకున్నారు. విశ్వ క్రీడలో చారిత్రాత్మక ప్రదర్శన అనంతరం తాజాగా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇవాళ ఉదయం కోచ్ జస్పాల్ రాణా (Jaspal Rana)తో కలిసి దేశరాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో (Delhi airport) ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా షూటర్కు ఘన స్వాగతం లభించింది.
కాగా, పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో మను బాకర్ రెండు పతకాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రెండు సార్లూ కాంస్య పతకాన్ని ముద్దాడింది. అయితే, ఈ విశ్వ క్రీడల్లో హ్యాట్రిక్ మెడల్స్ కొట్టే అవకాశాన్ని మను చేజార్చుకుంది. ఈవెంట్లో టాప్ ఫామ్లో ఉన్న ఆ షూటర్.. 25మీటర్ల పిస్తోల్ ఈవెంట్లో తృటిలో కాంస్య పతకాన్ని మిస్ చేసుకుంది. దీంతో రెండు పతకాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండు పతకాలతోపాటు ఎన్నో రికార్డులను కూడా తన పేరిట లిఖించుకుని భారత్ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పింది.
#WATCH | Double Olympic medalist in shooting, Manu Bhaker and her coach Jaspal Rana receive a grand welcome after they arrive at Delhi airport after Manu Bhaker’s historic performance in #ParisOlympics2024
She won bronze medals in Women’s 10m Air Pistol & the 10m Air Pistol… pic.twitter.com/h7syhyk1Sy
— ANI (@ANI) August 7, 2024
Also Read..
Serena Williams: పారిస్ రెస్టారెంట్లో సెరీనా విలియమ్స్కు చేదు అనుభవం
Imane Khelif: గోల్డ్ మెడల్ మ్యాచ్ ఆడనున్న ఆ వివాదాస్పద బాక్సర్
Sheikh Hasina: యూఏఈ, సౌదీ ఆరేబియాలో ఆశ్రయం కోసం షేక్ హసీనా ప్రయత్నాలు