Srikar Bharat : ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్(Srikar Bharat) పేలవ ఫామ్తో నిరాశపరుస్తున్నాడు. రిషభ్ పంత్(Rishabh Pant) లోటును భర్తీ చేయలేక విమర్శల పాలవుతున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో భారీ స్కోర్ చేయని భరత్.. సొంత గడ్డపై కూడా తేలిపోతున్నాడు. దాంతో, అతడిపై వేటు వేసేందుకు సిద్ధమవుతోంది. సిరీస్లో కీలకమైన రాజ్కోట్ టెస్టులో భరత్ స్థానంలో యంగ్స్టర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel)ను ఆడిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సిరీస్కు ముందు ఇంగ్లండ్ లయన్స్పై 116 పరుగులతో చెలరేగిన భరత్.. సీనియర్ జట్టుపై మాత్రం చతికిలపడుతున్నాడు. అదే ధ్రువ్ జురెల్ మాత్రం పరగులు వరద పారిస్తున్నాడు. నిరుడు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 15 మ్యాచుల్లో 790 రన్స్ కొట్టాడు. దాంతో, మూడో టెస్టులో జురెల్కు చాన్స్ ఇవ్వాలని కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్లు భావిస్తున్నారని సమాచారం. ఫిబ్రవరి 15న రాజ్కోట్లో మూడో టెస్టు జరుగనుంది. చెరి రెండు టెస్టులు నెగ్గిన భారత్, ఇంగ్లండ్లు ఈ మ్యాచ్ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనున్నాయి.
ధ్రువ్ జురెల్, శ్రీకర్ భరత్
రెగ్యులర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయపడడంతో భరత్కు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడే చాన్స్ వచ్చింది. అయితే.. ఆరు ఇన్నింగ్స్ల్లో 101 రన్స్ మాత్రమే చేసినా వికెట్ కీపింగ్తో ఆకట్టుకున్నాడు. కానీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ పైనల్లో5, 23 పరుగులతో నిరాశపరిచాడు. ఉప్పల్ టెస్టులో 41 రన్స్ కొట్టినా.. వైజాగ్ టెస్టులో విఫలమయ్యాడు. ఇప్పటివరకూ 7 టెస్టులు ఆడిన భరత్ 12 ఇన్నింగ్స్ల్లో 221 రన్స్ చేశాడంతే. అది కూడా 20.09 సగటుతో.