Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ బీహార్ అసెంబ్లీలో బలం నిరూపించుకున్నారు. మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో.. ప్రభుత్వం నిలబడాలంటే 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఇవాళ విశ్వాస తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా నితీశ్కుమార్కు మద్దతుగా 129 మంది ఎమ్మెల్యేలు ఓటువేశారు. దాంతో నితీశ్ సర్కారు బలపరీక్ష నెగ్గింది.
కాగా, విశ్వాస తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా విపక్షాలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశాయి. దాంతో సభలో మిగిలిన 129 మంది ఎమ్మెల్యేలు తీర్మానానికి మద్దతుగా ఓటువేశారు. విపక్ష ఎమ్మెల్యేలు లేకపోవడంతో వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు.
#WATCH | Bihar CM Nitish Kumar’s government wins Floor test after 129 MLAs support the resolution.
The opposition walked out from the State Assembly. pic.twitter.com/Xr84vYKsbz
— ANI (@ANI) February 12, 2024