Dharmashala Stadium : ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్లో భారత జట్టు(Team India) హ్యాట్రిక్ విజయాలతో అదరగొట్టింది. మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా ఐదో టెస్టులోనూ బెన్ స్టోక్స్ సేనను మట్టికరిపించేందుకు సిద్ధమవుతోంది. మార్చి 7 వ తేదీన మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. ఈ మ్యాచ్లో ఇరుజట్ల ఆటగాళ్లకు బౌలర్ల కంటే వాతావరణంతోనే అసలైన సవాల్ ఎదురుకానుంది.
హిమాలయ పర్వత సానువుల్లోని ధర్మశాల(Dharmashala Stadium)స్టేడియంలో ప్రస్తుతం చల్లని వాతావరణం ఉంది. మ్యాచ్ సమయానికల్లా స్టేడియంలో వడగండ్లు పడే చాన్స్ ఉంది. సముద్ర మట్టానికి 1,457 మీటర్ల ఎత్తులో ఉండే ధర్మశాల స్టేడియంలో తొలి రెండు రోజులు వాతావరణం బాగా చల్లగా ఉంటుందని భారత వాతావరణ శాఖ కూడా తెలిపింది.
కుర్రాళ్లు యశస్వీ జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, శుభ్మన్ గిల్, ధ్రువ్ జురెల్లు దంచి కొట్డగా.. స్పీడ్స్టర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్లు కుల్దీప్, అశ్విన్లు ఇంగ్లండ్ భరతం పట్టారు. దాంతో, స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లండ్ తొలిసారి టెస్టు సిరీస్ కోల్పోయింది.
శుభ్మన్ గిల్, ధ్రువ్ జురెల్
నామమాత్రమైన ఐదో టెస్టులోనూ విజయంపై కన్నేసిన భారత్.. బ్యాటింగ్ విభాగంపై దృష్టి పెట్టింది. వరుసగా విఫలమైన రజత్ పాటిదార్ స్థానంలో యువకెరటం దేవ్దత్ పడిక్కల్ను ఆడించే చాన్స్ ఉంది. ప్రస్తుతం టీమిండియా డబ్ల్యూటీసీ(WTC 2023-35) పట్టికల్ అగ్రస్థానంలో ఉంది. ఐదో టెస్టులోనూ గెలిస్తే.. వరుసగా మూడోసారి ఫైనల్ చేరే అవకాశం ఉంది.