ప్రతి ఏటా వేసవిలో పలువురు చిన్నారుల మృతి
పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
హన్వాడ, మే 6 : కరోనా నేపథ్యం, పాఠశాలలకు సెలవులు ఉండటంతో పిల్లలు సరదా కోసం ఆయా గ్రామాల సమీపంలోని బావుల వద్దకు ఈతకు వెళ్తుంటారు. ప్రతి ఏడాది వేసవిలో ఈతకు వెళ్లిన చిన్నారుల్లో పలువురు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. వారి తల్లిదండ్రులకు చెప్పకుండా తోటి స్నేహితులతో కలిసి వేసవి తాపం ఉపశమనం పొందేందుకు బావులు, కాలువల వద్దకు ఈతకు వెళ్తుంటారు. అందుకే పిల్లల పట్ల వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. వారు ఎక్కడికి వెళ్తున్నారో గమనించుకుంటూ ఉండాలి. ఒకవేళ ఈతకు వెళ్లాల్సి వస్తే.. వారి వెంట ఇంటి సభ్యులు ఎవరైనా పెద్దవారు వెళ్లాలి.
గతంలో పలువురు మృతి
గత సంవత్సరంలో మండలంలోని కిష్టపల్లి గేటు తండా వద్ద బావిలో పడి ఓ విద్యార్థి మృతి చెందాడు. సరదాలో భాగంగా ఒక్కరిపై ఒకరు దూకడంతో వారికి ఊపిరి ఆడకపోవడంతో మృతి చెందారు. అలాగే హన్వాడ, మాదారం, వేపూర్ గ్రామాల్లో చిన్న పిల్లలు మృతి చెందిన ఘటనలు కూడా ఉన్నాయి. గతేడాది వేసవి సెలవుల్లో కొత్తకోట గ్రామ సమీపంలోని వ్యవసాయ బావికి తల్లిదండ్రులకు చెప్పకుండా ఈతకు వెళ్లగా ము గ్గురు చిన్నారులు మృతి చెందారు. ఇలాం టి ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎండాకాలంలో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి.