కింగ్డావో (చైనా): బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్షిప్స్లో డిపెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు తొలి మ్యాచ్లో అదరగొట్టింది. స్టార్ షట్లర్లు అందుబాటులో లేకున్నా యువ ఆటగాళ్ల దూకుడుతో బుధవారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్లో 5-0తో మయన్మార్పై క్లీన్స్వీప్ చేశారు. సింగిల్స్ విభాగాల్లో తన్వి శర్మ, రక్షిత శ్రీ, మాళవిక అలవోక విజయాలు సాధించారు.
డబుల్స్లో ప్రియా-శృతి జోడీ, త్రిసా-గాయత్రి ద్వయం సైతం తమ ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. పురుషుల విభాగంలో భారత్.. 3-2తో సింగపూర్ను ఓడించింది. సింగిల్స్లో లక్ష్యసేన్ ఓడగా, అయూశ్, శ్రీకాంత్ గెలిచారు. డబుల్స్లో పృథీ-సాయి ప్రతీక్ ద్వయం ఓడినా సాత్విక్-చిరాగ్ జోడీ విజయం సాధించింది.