పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సునాయాస విజయం సాధించింది. అంతకుముందు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో పంజాబ్ను 115 పరుగులకు ఆలౌట్ చేసిన ఢిల్లీకి.. పృథ్వీ షా (41), డేవిడ్ వార్నర్ (60 నాటౌట్) అదిరిపోయే ఆరంభం అందించారు. వీళ్లిద్దరూ బౌండరీలతో విరుచుకుపడటంతో పంజాబ్ బౌలర్లు చేతులెత్తేశారు.
అయితే ఏడో ఓవర్లో రాహుల్ చాహర్.. పంజాబ్ జట్టుకు కొంత ఊరటనిస్తూ పృథ్వీ షాను అవుట్ చేశాడు. అయితే అప్పటికే స్కోరు 80 పరుగులు దాటింది. ఇక ఢిల్లీ విజయం లాంఛనమే అని అందరికీ అర్థమైపోయింది. ఇలాంటి సమయంలో కూడా వార్నర్ నిదానించలేదు. ఎడాపెడా బౌండరీలు బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
చివరకు 11వ ఓవర్లో బౌండరీతో ఢిల్లీకి విజయం సాధించిపెట్టాడు. అతను 30 బంతుల్లోనే 60 పరుగులు చేయడం గమనార్హం. దీంతో ఢిల్లీ ఖాతాలో మరో విజయం చేరగా.. పంజాబ్ నెట్రన్రేట్పై తీవ్రమైన ప్రభావం పడింది.
A big win for Delhi Capitals as they chase down 116 in just 10.3 overs.#DCvPBKS #DCvsPBKS #DC #PBKS #DelhiCapitals #PunjabKings #IPL #IPL2022 #IndianPremierLeague #Cricket #CricketWinner pic.twitter.com/sQvxGpVtMZ
— Cricket Winner (@cricketwinner_) April 20, 2022