బెంగుళూరు: శ్రీలంకతో ఇవాళ డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటికే సిరీస్లో 1-0 ఆధిక్యాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా ఆరంభంలోనే మయాంక్ అగర్వాల్ వికెట్ను కోల్పోయింది. అగర్వాల్ రనౌట్ అయ్యాడు. ఫెర్నాండో బౌలింగ్లో లెగ్ బై కోసం అగర్వాల్ ప్రయత్నించగా రనౌట్ అయ్యాడు. ఇండియన్ జట్టులోకి జయంత్ యాదవ్ స్థానంలో అక్షర్ పటేల్ వచ్చాడు. శ్రీలంక జట్టులో కుషాల్ మెండిస్, ప్రవీణ్ జయవిక్రమను ఎంపిక చేశారు. భారత్ ఏడు ఓవర్లలో వికెట్ నష్టానికి 24 రన్స్ చేసింది.