లాన్బౌల్స్లో భారత్కు రెండో పతకం దక్కింది. ఇప్పటికే మహిళల ఫోర్స్ ఈవెంట్లో భారత బృందం పసిడి పతకం కొల్లగొట్టి నయా చరిత్ర లిఖిస్తే.. పురుషుల ఫోర్స్ టీమ్ విభాగంలో మనవాళ్లు రజత పతకం సొంతం చేసుకున్నారు. శనివారం ఫైనల్లో సునీల్ బహాదూర్, నవ్నీత్, చందన్ కుమార్, దినేశ్ కుమార్తో కూడిన భారత జట్టు 5-18తో నార్త్ ఐర్లాండ్ చేతిలో ఓటమి పాలైంది. ఆతిథ్య ఇంగ్లండ్ హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో 13-12తో విజయం సాధించిన భారత్.. ఫైనల్లో సేమ్ సీన్ రిపీట్ చేయలేకపోయింది.