ఇంగ్లండ్లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత సైక్లిస్ట్ మీనాక్షికి ప్రమాదం జరిగింది. మహిళల 10 కిలోమీటర్ల స్క్రాచ్ రేసులో పాల్గొన్న ఆమె తన సైకిల్ అదుపుతప్పడంతో కిందపడిపోయింది. అదే సమయంలో ఆమె వెనుకే వస్తున్న న్యూజిల్యాండ్ సైక్లిస్ట్ బ్రయానీ బోథా.. కిందపడి ఉన్న మీనాక్షిని తప్పించలేకపోయింది.
ఈ క్రమంలో మీనాక్షిని తొక్కేసి, తను కూడా పడిపోయింది. ఈ భయంకరమైన దృశ్యాన్ని చూసిన మెడిక్స్ వెంటనే రంగంలోకి దిగి మీనాక్షి, బోథా ఇద్దరికీ ప్రాథమిక చికిత్స అందించారు. ప్రమాదానికి గురైన ఇద్దరు సైక్లిస్టులను రేసు నుంచి పక్కకు తీసుకొచ్చేశారు. ఈ క్రమంలో మీనాక్షికి తీవ్రమైన గాయం కావడంతో ఆమెను స్ట్రెచర్పై తీసుకెళ్లారు.
కొన్నిరోజుల క్రితం పురుషుల సైక్లింగ్ ఈవెంట్లో కూడా ఇలాగే భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. సైక్లిస్ట్ తన వేగాన్ని అదుపు చేసుకోలేక ప్రేక్షకుల్లోకి దూసుకెళ్లడంతో.. అక్కడ ఉన్న ప్రేక్షకుడికి తీవ్రంగా గాయమైంది. సైక్లిస్ట్ కూడా దెబ్బతిన్నాడు.
Horrible accident involving Indian cyclist Meenakshi at the Velodrome. Hope she’s ok! #CommonwealthGames #B2022 pic.twitter.com/o0i4CE7M82
— Sahil Oberoi (@SahilOberoi1) August 1, 2022