MS Dhoni : ఈ మధ్యే మోకాలి సర్జరీ(knee surgery) చేయించుకున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni ) స్వరాష్ట్రానికి పయనమయ్యాడు. సర్జరీ తర్వాత ముంబైలోనే ఉన్న మహీ ఈరోజు రాంచీ విమానం ఎక్కాడు. ఫ్యామిలీతో ఎయిర్పోర్ట్ వెళ్లిన అతడిని మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్(Mohammad Kaif) కలిశాడు. తన కమారిడితో కలిసి ధోనీ భార్య సాక్షి, కూతురు జీవాతో కలిసి ఫొటో దిగాడు. ఆ ఫొటోలను కైఫ్ సోషల్మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
‘ఈ రోజు మేము గొప్ప మనిషిని, అతడి కుటుంబాన్ని కలిశాం. ధోనీతో ఫొటో దిగే అవకాశం వచ్చినందుకు నా కొడుకు కబీర్ చాలా సంతోషించాడు. అంతేకాదు మావాడితో ధోనీ తాను చిన్నప్పుడు ఫుట్బాల్ ఆడేవాడినని చెప్పాడు’ అని ఆ ఫొటోలకు క్యాప్షన్ రాశాడు. ఈ మిస్టర్ కూల్ కెప్టెన్ సీఎస్కేను చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్ తర్వాత మోకాలి గాయం తీవ్రం కావడంతో ధోనీ వెంటనే ముంబై వెళ్లాడు. కోకిలాబెన్ ఆస్పత్రిలో రిషభ్ పంత్(Rishabh Pant)కు ఆపరేషన్ చేసిన డాక్టర్ దిన్షా పండివాలా(Dr. Dinshaw Pardiwala) దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్నాడు.
We met the great man and his family at airport today. He was returning home after surgery. Son Kabir super happy as Dhoni told him he too, like him, played football as a kid. Get well soon, see you next season champion.@msdhoni pic.twitter.com/ZVoKjxhudu
— Mohammad Kaif (@MohammadKaif) June 5, 2023
ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) అద్భుత విజయం సాధించి ట్రోఫీ ఎగరేసుకుపోయింది. ఆఖరి ఓవర్లో చివరి రెండు బంతులకు రవీంద్ర జడేజా(15 నాటౌట్) సిక్స్, ఫోర్ కొట్టి చెన్నైని గెలిపించాడు. పరుగెత్తుతూ వెళ్లి డగౌట్లో ఉన్న కెప్టెన్ ఎంఎస్ ధోనీని కౌగిలించుకున్నాడు. ధోనీ అతడిని అమాంతం ఎత్తుకుని అభినందించాడు.
ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 233 రన్స్ కొట్టింది. యంగ్స్టర్ సాయి శ్రీనివాస్(96) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. రెండో ఇన్నింగ్స్కు వర్షం ఆటంకం కలిగించడంతో మ్యాచ్ను 15 ఓవర్లకు కుదించారు. దాంతో, చెన్నైకి 171 పరుగుల లక్ష్యాన్ని విధించారు. లక్ష్య ఛేదనలో ఓపెనర్ డెవాన్ కాన్వే(47), రుతురాజ్ గైక్వాడ్(26) దంచారు. ఆ తర్వాత వచ్చిన రహానే(27), శివం దూబే(32 నాటౌట్), అంబటి రాయుడు(19) తలా ఒక చేయి వేశారు.