Cricket Australia – WTC Team : మరో మూడు రోజుల్లో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్( WTC Final 2023) మొదలుకానుంది. దాంతో, భారత్, ఆస్ట్రేలియా జట్లలో విజేతగా నిలిచేది ఎవరు? అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. అయితే… టెస్టు చాంపియన్షిప్ సీజన్లో అత్యద్భుతంగా రాణించిన 11 మంది ఆటగాళ్లతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు(Cricket Australia) డబ్ల్యూటీసీ జట్టును ప్రకటించింది. 2021 -23 మధ్య కాలంలో సంచలన ఆటతో వార్తల్లో నిలిచిన ప్లేయర్స్ ఈ టీమ్లో చోటు దక్కించుకున్నారు. ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా) కెప్టెన్గా ఉన్న ఈ టీమ్లో ముగ్గురు భారత క్రికెటర్లు ఉన్నారు.
ఆ ముగ్గురు ఎవరంటే..? డాషింగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant), ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్. ఆస్ట్రేలియా నుంచి ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్ ఎంపికయ్యారు. ఇంగ్లండ్ ఆటగాళ్లు జో రూట్, జేమ్స్ అండర్సన్ ఈ జాబితాలో ఉన్నారు. కరుణరత్నే(శ్రీలంక), కగిసో రబడ(దక్షిణాఫ్రికా), బాబార్ ఆజం (పాకిస్థాన్ ) డబ్ల్యూటీసీ జట్టుకు సెలక్ట్ అయ్యారు.
The 2021-23 World Test Championship reaches its conclusion this week! #WTC23 #WTCFinal
We’ve put our selectors caps on to come up with the ultimate Test XI from the last two years: https://t.co/5yzXgTlicy pic.twitter.com/m6GToMYtoy
— cricket.com.au (@cricketcomau) June 4, 2023
ఆస్ట్రేలియా – ప్యాట్ కమిన్స్, ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్.
భారత్ – షభ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్.
ఇంగ్లండ్ – జో రూట్, జేమ్స్ అండర్సన్.
శ్రీలంక – కరుణరత్నే. దక్షిణాఫ్రికా – కగిసో రబడ, పాకిస్థాన్ – బాబార్ ఆజం
ఓవల్ స్టేడియంలో జూన్ 7 -11 తేదీల్లో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ జరగనుంది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ తర్వాత తొలిసారి భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్న టెస్టు ఇది. దాంతో, ఫైనల్ హోరాహోరీగా ఉండనుంది. 2021లో ఫైనల్ చేరిన టీమిండియా న్యూజిలాండ్ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైంది. దాంతో, టీమిండియా ఈసారి కప్పు కొట్టాలనే కసితో ఉంది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో 2-1తో ప్యాట్ కమిన్స సేనను భారత జట్టు ఓడించింది. దాంతో, ఫైనల్లో కూడా అదే ఫలితం రాబట్టాలని రోహిత్ బృందం భావిస్తోంది.