హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో వరుసగా రెండో సారి పసిడి పతకం గెలుచుకున్న నిఖత్ జరీన్ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభినందించారు. ఢిల్లీలో జరిగిన ఫైనల్ 50 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
‘వియత్నాంకు చెందిన బాక్సర్ న్యుయెన్పై 5-0 తేడాతో ఘన విజయం సాధించి భారత్కు మరోసారి గోల్డ్ మెడల్ సాధించి పెట్టిన నిఖత్ జరీన్ తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తన వరుస విజయాలతో దేశఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. ప్రపంచ చాంపియన్ పోటీల్లో తన కెరీర్లో ఇది రెండో బంగారు పతకం కావడం గొప్ప విషయమని సీఎం అన్నారు. క్రీడాభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి సంక్షేమానికి, తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ దిశగా తమ కృషిని కొనసాగిస్తూనే వుంటామని స్పష్టం చేశారు.