బీజింగ్: టోక్యో ఒలింపిక్స్లో చైనా భారీ బలగంతో బరిలోకి దిగుతున్నది. మొత్తం 777 మందితో కూడిన బృందంలో 431 మంది అథ్లెట్లు ఉన్నారని చైనా అధికారిక వార్తాసంస్థ జినుహ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇందులో 298 మహిళా అథ్లెట్లు ఉంటే 133 మంది పురుషులు ఉన్నారు. 14 ఏండ్ల యువ డైవర్ క్వాన్ హంగ్చాన్ పిన్న వయస్కురాలు కాగా 52 ఏండ్ల ఈక్వెస్ట్రియన్ రైడర్ జెన్క్వియాంగ్ అందరికంటే పెద్దవాడు.చైనా బయట జరుగుతున్న ఒలింపిక్స్లో ఇంత భారీ స్థాయిలో అథ్లెట్లను పోటీకి దించడం ఇదే తొలిసారని సదరు వార్తాసంస్థ తెలిపింది. అమెరికాకు దీటైన పోటీకి చైనా సై అంటున్నది.