Chateshwar Pujara : భారత టెస్టు స్పెషలిస్ట్ ఛతేశ్వర్ పూజారా(Chateshwar Pujara) రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీ బాదాడు. పరుగుల దాహంతో ఉన్నఈ సౌరాష్ట్ర(Sourashtra) బ్యాటర్ జార్ఘండ్(Jharkhand)పై 243 రన్స్తో విరుచుకుపడ్డాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC 2023) వైఫల్యంతో జట్టుకు దూరమైన నయావాల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 17వ ద్విశతకం నమోదు చేశాడు.
ఈ ఇన్నింగ్స్తో ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్కు తాను సిద్దంగా ఉన్నానంటూ సెలెక్టర్లుకు సందేశాలు పంపాడు. జార్ఘండ్ బౌలర్లను ఉతికారేస్తూ 356 బంతుల్లో డబుల్ సెంచరీ బాది జట్టుకు భారీ స్కోర్ అందించాడు. యువ ఆటగాడు ప్రేరక్ మన్కడ్ 104 సెంచరీ కొట్టడంవతో సౌరాష్ట్ర 578\4 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
𝗗𝗼𝘂𝗯𝗹𝗲 𝗗𝗲𝗹𝗶𝗴𝗵𝘁 𝗳𝗼𝗿 𝗖𝗵𝗲𝘁𝗲𝘀𝗵𝘄𝗮𝗿 𝗣𝘂𝗷𝗮𝗿𝗮! 💯💯
A spectacular 2⃣0⃣0⃣ in Rajkot from the Saurashtra batter! 👏👏
Follow the match ▶️ https://t.co/xYOBkksyYt#RanjiTrophy | #SAUvJHA | @IDFCFIRSTBank | @saucricket | @cheteshwar1 pic.twitter.com/ofLZSf2qcl
— BCCI Domestic (@BCCIdomestic) January 7, 2024
రంజీల్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన సౌరాష్ట్ర.. జార్ఘండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. చిరాగ్ జానీ 5 వికెట్లతో విజృంభించడంతో జార్ఘండ్ తొలి ఇన్నింగ్స్లో 142 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన సౌరాష్ట్రను హర్విక్ దేశాయ్(85), షెల్డన్ జాక్సన్(54) హాఫ్ సెంచరీతో ఆదుకున్నారు. ఇక నాలుగో స్థానంలో వచ్చిన పూజారా క్రీజులో పాతుకుపోయాడు.
మూడో రోజు సెంచరీతో కదం తొక్కిన నయావాల్ 317 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. దాంతో, త్వరలో స్వదేశంలో జరుగబోయే ఇంగ్లండ్ సిరీస్కు తనను పరిగణించాలని సెలెక్టర్లకు సందేశం పంపాడు. ఇంగ్లీష్ జట్టు ఐదు టెస్టుల సిరీస్ కోసం జనవరి మూడో వారంలో భారత పర్యటనకు రానుంది. ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జనవరి 25న హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది.