హైదరాబాద్: హైదరాబాద్లోని (Hyderabad) పలు చోట్ల తూనికలు, కొలతల శాఖ తనిఖీలు నిర్వహించారు. దుకాణాదారులు తూనికల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన అధికారులు 54 కేసులు నమోదుచేశారు. అసిస్టెంట్ కంట్రోలర్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో కొత్తపేట, ఉప్పల్, కుషాయిగూడ, వికారాబాద్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కొత్తపేట మార్కెట్లో మాసం కిలోకి 800 గ్రాములే విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
దీంతో కొత్తపేట రైతుబజార్లో 19 కేసులు నమోదుచేశారు. ఇక వికారాబాద్ పరిధిలో 29, ఉప్పల్, కుషాయిగూడలో ఆరు చొప్పున కేసులు నమోదుచేశారు. డిజిటల్ కాంటాల్లో సెట్టింగ్స్ మార్చిన వ్యాపారులు తక్కువ తూకం చూపిస్తున్నారు.