Virat Kohli | టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి చెందిన ఓ పబ్పై కేసు నమోదైంది. బెంగళూరు (Bengaluru)లోని ఎమ్జీ రోడ్డులో ఉన్న కోహ్లీకి చెందిన వన్ 8 కమ్యూన్ (One8 Commune) పబ్ నిర్ణీత సమయానికి మించి తెరిచి ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేశారు (Case against Kohli pub).
అర్ధరాత్రి భారీగా సౌండ్లు రావడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు కబ్బన్ పార్క్ పోలీసులు నగరంలోని రెస్టారెంట్లు, బార్లు, పబ్బులపై స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో ఎమ్జీ రోడ్డులోని వన్ 8 కమ్యూన్, చర్చి స్ట్రీట్లోని ఎంపైర్ రెస్టారెంట్, బ్రిగేడ్ రోడ్డులోని పాంజియో బార్ అండ్ రెస్టారెంట్లు అర్ధరాత్రి 1:30 గంటల వరకూ తెరిచి ఉంచడాన్ని గుర్తించారు. దీంతో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి అర్ధరాత్రి దాటినా తెరిచి ఉంచడంతో ఆయా రెస్టారెంట్లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Karnataka | FIR registered against Virat Kohli owned One8 Commune in Bengaluru’s MG road.
We have booked around 3-4 pubs for running late till 1:30 am last night. We received complaints of loud music being played. Pubs were allowed to remain open only till 1 am and not beyond…
— ANI (@ANI) July 9, 2024
ఈ విషయమై బెంగళూరు సెంట్రల్ డివిజన్ డీసీపీ శేఖర్ హెచ్.టి. మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి మించి కస్టమర్లను అనుమతించిన పబ్బులు, రెస్టారెంట్లపై కేసు నమోదు చేశామన్నారు. పబ్బులకు అర్ధరాత్రి 1 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచడానికి పర్మిషన్ ఉందని తెలిపారు. దీంతో కోహ్లీ వన్ 8 కమ్యూన్ సహా సెంట్రల్ డివిజన్ పరిధిలో పలు రెస్టారెంట్లు, బార్లు, పబ్బులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కాగా, కోహ్లీ ప్రస్తుతం లండన్లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే టీ20 ప్రపంచకప్తో బిజీగా గడిపిన కోహ్లీ స్వదేశంలో సంబరాల అనంతరం లండన్ ఫ్లైట్ ఎక్కేసి వెళ్లిపోయారు. తన భార్య, బాలీవుడ్ నటి అనుష్కశర్మ, పిల్లలు వామిక, అకాయ్తో అక్కడే తన విలువైన సమయాన్ని గడుపుతున్నారు.
Also Read..
Mahesh Babu | ప్రతి ఫ్రేమ్ ఒక కళాఖండమే.. కల్కి మూవీపై మహేశ్ బాబు రివ్యూ
Mumbai Rains | ముంబైకి భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ.. పాఠశాలలకు సెలవు
Mujra Party | మొయినాబాద్లో ముజ్రా పార్టీ.. అమ్మాయిలతో గలీజు దందా