భూత్పూర్: టీకాతోనే కరోనా వైరస్ను అంతమొందించ్చవని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్లోని సబ్ సెంటర్లో ప్రత్యేక వ్యాక్సి నేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18నెలలుగా కరోనా వైరస్తో దేశమంతా అల్లకల్లోలం అవుతున్నదని, దీన్ని అంతమొందించాలనే ప్రతి సబ్ సెంటర్లో వ్యాక్సిన్ తీసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకొని కరోనా వైరస్ను అంతమొందించాలని ఆయన కోరారు. కార్యక్ర మంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, జిల్లా వైద్యాధికారి కృష్ణ, వైస్ చైర్మన్ కెంద్యాల శ్రీనివాస్, డీఐవో డాక్టర్ శంకర్, ప్రోగ్రాం ఆఫీసర్ సంధ్యాకిరణ్మయి, డాక్టర్ శ్రీకాంత్, సీహెచ్వో రామయ్య, కో ఆప్షన్ అజీజ్, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.