రాజ్కోట్: ఆస్ట్రేలియాతో జరిగిన మూడవ వన్డేలో 66 రన్స్ తేడాతో ఇండియా ఓడిన విషయం తెలిసిందే. కానీ ఆ సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకున్నది. అయితే తొలి రెండు వన్డేలకు కేఎల్ రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టగా, మూడవ వన్డేకు రోహిత్(Rohit Sharma) సారధం వహించాడు. రాజ్కోట్లో మ్యాచ్ ముగిసిన తర్వాత ట్రోఫీ అందజేసిన సమయంలో ఆసక్తికర ఘటన జరిగింది. నిజానికి ఆ మ్యాచ్ సమయంలో కెప్టెన్గా ఉన్న రోహిత్కు ట్రోఫీని అందజేయాలి. కానీ తొలి రెండు వన్డేలకు కెప్టెన్గా చేసిన రాహుల్ను ట్రోఫీ అందుకోవాలని రోహిత్ కోరాడు. రోహిత్ ప్రదర్శించిన ఔదార్యం అందర్నీ ఆకట్టుకున్నది. రాహుల్ వచ్చి ట్రోఫీని అందుకున్నాడు. ఆ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Captain @ImRo45 & @klrahul collect the @IDFCFIRSTBank Trophy as #TeamIndia win the ODI series 2⃣-1⃣ 👏👏#INDvAUS pic.twitter.com/k3JiTMiVGJ
— BCCI (@BCCI) September 27, 2023