Neeraj Chopra | భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) అథ్లెటిక్స్ చాంపియన్షిప్ (World Athletics Championship)లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. హంగేరీ రాజధాని బుడాపెస్ట్ (Budapest) లో జరుగుతున్న మెగాటోర్నీలో ఆదివారం నీరజ్ బరిసెను 88.17 మీటర్ల దూరం విసిరి పసిడి పతకం సాధించాడు. అయితే ఈ టోర్నీ అనంతరం భారత జాతీయ జెండా (Indian National Flag)పై నీరజ్ తన దేశభక్తిని చాటుకున్నాడు.
వివరాల్లోకెళితే.. అథ్లెటిక్స్ చాంపియన్షిప్ టోర్నీ అనంతరం నీరజ్ చోప్రా దగ్గరికి ఒక హంగేరీయన్ (Hungerian Fan) అభిమాని వచ్చి భారత జాతీయ జెండా(Indian National Flag)పై ఆటోగ్రాఫ్ ఇవ్వమని కోరింది. దీనిపై నీరజ్ సున్నితంగా తిరస్కరిస్తూ.. ”క్షమించండి. ఇది మా జాతీయ జెండా. దీనిపై ఆటోగ్రాఫ్ ఇవ్వడం నిబంధనలను అతిక్రమించడం అవుతుంది.. దానికి బదులుగా మీ టీషర్ట్పై ఆటోగ్రాఫ్ ఇవ్వగలను” అంటూ ఆమె టీషర్ట్పై ఆటోగ్రాఫ్ చేశాడు. దీనికి సంబంధించిన ఫొటో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
This is Neeraj Chopra, Olympic Gold Medalist.
After winning the #WorldAthleticsChamps in Budapest yesterday, A hungarian fan came to him with an Indian flag and asked him to sign it for her.
Subedar Neeraj Chopra humbly denied and said “ Sorry Mam, it is a violation of my flag… pic.twitter.com/mc7afI6h4e
— Roshan Rai (@RoshanKrRaii) August 28, 2023
నిరుడు ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో రజతం నెగ్గిన నీరజ్ ఈసారి పసిడి ముద్దాడాడు. క్వాలిఫయింగ్ రౌండ్లో మొదటి ప్రయత్నంలోనే బరిసెను 88.77 మీటర్ల దూరం విసిరి ఫైనల్కు చేరడంతో పాటు వచ్చే ఏడాది పారిస్ వేదికగా జరుగనున్న ఒలింపిక్స్కు అర్హత సాధించిన నీరజ్.. తుదిపోరులోనూ దుమ్మురేపాడు. పాకిస్థాన్కు చెందిన అర్షద్ నదీమ్ (87.82) రజతం నెగ్గగా.. చెక్కు చెందిన వద్లెచ్ (86.67) కాంస్యం చేజిక్కించుకున్నాడు.