సావోపాలో: ఫుట్బాల్ దిగ్గజం పీలే (Pele) కన్నుమూశారు. చెప్పులు లేని పేదరికం నుంచి ఆధునిక చరిత్రలో గొప్ప, ప్రసిద్ధ అథ్లెట్లలో ఒకరిగా ఎదిగిన లెజెండరీ ఆటగాడు.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సావోపాలోలోని ఆల్బర్ట్ ఐన్స్టీన్ దవాఖానలో తుదిశ్వాస విడిచారు. బ్రెజిల్కు చెందిన 82 ఏండ్ల పీలే గతేడాది పెద్దపేగు క్యాన్సర్ బారిన పడ్డారు. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఇటీవల ఆరోగ్యం విషమించడంతో అవయవాలు పనిచేయడం మానేశాయి. దీంతో కొన్నిరోజులుగా మృత్యువుతో పోరాడుతున్న ఆయన గురువారం రాత్రి కన్నుమూశారు. పీలే అసలు పేరు ఎడ్సన్ అరాంట్స్ డో నాసిమియాంటో.
మూడుసార్లు ప్రపంచకప్ గెలిచిన ఏకైక వ్యక్తిగా చరిత్ర పుట్టల్లోకి ఎక్కిన పీలే.. 1940, అక్టోబర్ 23న జన్మించారు. 1956లో శాంటోస్ క్లబ్లో చేరారు. 17 ఏండ్ల వయస్సులోనే ఫుట్బాల్ ప్రపంచకప్లో బ్రెజిల్కు ప్రాతినిథ్యం వహించారు. 1958లో స్వీడెన్లో జరిగిన ఫిఫా వరల్డ్కప్లో జట్టులో ప్రధానపాత్ర పోషించారు.
1958, 1962, 1970లో తన జట్టుకు ప్రపంచకప్లు అందించాడు. ఫార్వర్డ్గా, అటాకింగ్ మిడ్ఫీల్డర్గా గ్రౌండ్లో పాదరసంలా కదిలే పీలే మొత్తంగా నాలుగు ప్రపంచకప్లలో ఆడారు. 1971 జులైలో యుగోస్లేవియాతో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఫుట్బాల్ దిగ్గజం.. సుమారు రెండు దశాబ్దాలపాటు ప్రేక్షకులను అలరించారు.
A inspiração e o amor marcaram a jornada de Rei Pelé, que faleceu no dia de hoje.
Amor, amor e amor, para sempre.
.
Inspiration and love marked the journey of King Pelé, who peacefully passed away today.Love, love and love, forever. pic.twitter.com/CP9syIdL3i
— Pelé (@Pele) December 29, 2022