కొత్తూరు, ఏప్రిల్ 28 : నందిగామ మండల కేంద్రంలోని అలిన్ ఫార్మాలో ఈ నెల 26న జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురి ప్రాణాలను కాపాడిన బాలుడు సాయిచరణ్ను సీఎం రేవంత్రెడ్డి అభినందించారు. ఆదివారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సాయిచరణ్ను సీఎం వద్దకు తీసుకెళ్లగా..
అతడిని సన్మానించి పుష్పగుచ్ఛాన్ని అందించారు. సాయిచరణ్ సాహసాన్ని సీఎం రేవంత్రెడ్డి కొనియాడారని ఎమ్మెల్యే శంకర్ చెప్పారు. నందిగామ మండల కేంద్రానికి చెందిన 15 ఏండ్ల సాయిచరణ్ ఇటీవలే టెన్త్ పూర్తి చేశాడు. కార్య క్రమంలో ఎంపీటీసీ కొమ్ముకృష్ణ, చంద్రపాల్, కుమారస్వామిగౌడ్, బాలుడి తల్లిదండ్రులు పాల్గొన్నారు.