కోటగిరి, ఏప్రిల్ 28: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతోనే పేదల సొంతింటి కల సాకారమైందని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పొతంగల్ మండలం హెగ్డోలి గ్రామంలో గంధపు చంద్రవ్వ సాయిలు నిర్మించుకున్న డబుల్ బెడ్ రూం ఇంటి గృహప్రవేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డిని లబ్ధిదారు కుటుంబసభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఉమా రాంబాబు, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఎజాజ్ఖాన్, యాదవ్రావు, నగేశ్, శివ, భాస్కర్బాబు, బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.