బీసీలను విస్మరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని బీసీ సంఘాలు పేర్కొంటున్నాయి. బీసీల్లో విభేదాలు సృష్టించేందుకు కొందరు కుయుక్తులు పన్నుతున్నారని, అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యధిక జనాభా కలిగిన బీసీలకు బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇతర పార్టీలేవీ ప్రాధాన్యత ఇవ్వడం లేదని బీసీ నేతలు వాపోతున్నారు. స్వలాభాపేక్ష కోసమే తప్ప బీసీ కులాల సమస్యల పరిష్కారానికి ఏ రాజకీయ నేత కూడా చొరవ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చేవెళ్ల లోక్సభలో బీసీలకు బీఆర్ఎస్ పార్టీ మంచి అవకాశం కల్పించిందని చెబుతున్నారు. బీసీల సమస్యలపై మాట్లాడే గళం పార్లమెంటులో ఉండాలని, బీసీ బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ గెలుపుతోనే అది సాధ్యమని వారు స్పష్టం చేస్తున్నారు. మన ఓట్లను మనమే వేసుకుందామన్న నినాదాన్ని బలంగా తీసుకెళ్లాలని, సభలు, సమావేశాలతో బీసీలను చైతన్యవంతులను చేద్దామని నేతలు పిలుపునిస్తున్నారు.
– రంగారెడ్డి, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ)
96 కులాల బీసీ ఐక్య వేదికను ఏర్పాటు చేసి అందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చిన చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి బీసీల సత్తా చాటుదాం. అన్ని రాజకీయ పార్టీల నేతలు బీసీ సామాజిక వర్గానికి చెందిన మంచి వ్యక్తిని గెలిపించుకునేందుకు రాజకీయాలు పక్కన పెట్టాలి. మన ఓట్లు మనమే వేసుకుందాం.
– రమేశ్, తాండూరు
బీఆర్ఎస్తోనే బీసీలకు రాజ్యాధికారం సాధ్యమవుతుంది. పార్టీలకు అతీతంగా బీసీలమంతా ఒక్కటైతే బీసీ ముద్దు బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ భారీ మెజార్టీతో ఘన విజయం సాధిస్తారు. బీసీల కోసం అనేక ఉద్యమాలు చేసిన జ్ఞానేశ్వర్ను బీసీలంతా ఆశీర్వదించాలి. బీసీలు సంపూర్ణ మద్దతు ఇస్తే పార్లమెంట్లో విజయం ఖాయం.
– ఎర్రం వసంత, మున్సిపల్ కౌన్సిలర్, తాండూరు
కాంగ్రెస్, బీజేపీలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయి. బీఆర్ఎస్తోనే బీసీలకు న్యాయం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో బీసీ అభ్యర్థి కాసానిని గెలిపించుకుంటే రానున్న రోజుల్లో బీసీల ప్రాధాన్యత రాజకీయాల్లో మరింత పెరుగుతుంది. అన్ని పార్టీలు బీపీలకు సీట్లు ఇచ్చేందుకు ముందుకొస్తాయి. కాసాని గెలుపుతో బీసీల్లో చైతన్యం వస్తుంది.
– మల్లేశం, రామయ్యగూడ, వికారాబాద్
ఓటు మన చేతిలో ఉన్నది. ఇంతకన్నా ఏం కావాలి. కాంగ్రెస్ నాయకుల మాటలు బీసీలను అవమానపరుస్తూ.. అత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. వెనుకబడిన బీసీలు రాజకీయాల్లో రాణించేందుకు ఇది మంచి అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన నాయకున్ని పార్లమెంట్కు పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
– లక్ష్మయ్య, మాజీ సర్పంచ్, గుడుపల్లి, వికారాబాద్
బీసీ సామాజిక వర్గానికి ఎంపీ టికెట్ ఇచ్చి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీసీలకు పెద్దపీట వేశారు. అనుభవం కలిగిన నేత కాసానిని గెలిపిస్తే సామాజికంగా బీసీలకు న్యాయం జరుగుతుంది. అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా బీసీ నాయకుడిని చేవెళ్ల గడ్డ నుంచి ఎంపీగా గెలిపించుకోవాలి. ప్రత్యేకంగా బీసీ నేతలు ఐక్యతను చాటి విమర్శలకు బుద్ధి చెప్పాలి.
– సాయినాథ్ కుమార్, చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, చేవెళ్ల
చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ బీసీ కులాలను ఏకం చేసేందుకు ఎన్నో పోరాటాలు చేసిన నాయకుడు. రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎమ్మెల్సీగా అనుభవం గలిగిన కాసాని జ్ఞానేశ్వర్ 100కు 100 శాతం గెలుపొందడం ఖాయం. రూ.500 కోట్లకు చేవెళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా రంజిత్రెడ్డి టికెట్ కొనుగోలు చేసినా ఓడిపోవడం ఖాయం.
– తోట చంద్రశేఖర్, చేవెళ్ల మండల యువజన సంఘం అధ్యక్షుడు, చేవెళ్ల
ఎలాంటి స్వార్థం లేకుండా సంవత్సరాల తరబడి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీసీల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ వస్తున్నారు. బీసీలు రాజ్యాధికారం వైపు రావాలని ఎన్నో ఉద్యమాలు చేశారు. ప్రతి ఒక్కరికి చేదోడువాదోడుగా ఉన్నారు. 93 బీసీల కులాలను ఏకం చేసిన బీసీ ఉద్యమనేత కాసాని. అలాంటి మంచి వ్యక్తిని పార్లమెంటుకు పంపిద్దాం.
– అనిల్ కుమార్ యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు
చేవెళ్ల పార్లమెంటు నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపు కోసం కృషి చేద్దాం. ప్రతి బీసీ ఓటర్ను తట్టి లేపుదాం. ఎంపీ అభ్యర్థిగా టికెట్ కేటాయించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు. బీసీలను గుర్తించి అన్ని రంగాల్లో బీసీలకు తగిన గుర్తింపు ఇచ్చింది కేసీఆర్. కుల వృత్తులకు జీవం పోశారు.
– పవన్ యాదవ్, యాదవ సంఘం నాయకుడు
చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ బీసీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. బీసీలపై అనుచిత వాఖ్యలు చేసిన వారికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రతి బీసీ ఓటర్పై ఉన్నది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కేసీఆర్ బీసీలకు ప్రథమ ప్రాధాన్యతను ఇస్తున్నారు. అభ్యర్థి కాసానికి రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్నది.
– ప్రవీణ్గౌడ్, కిస్మత్పూర్
బీసీలందరూ ఏకమై ఈ ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించుకోవాలి. చేవెళ్ల నుంచి మొదటిసారిగా బీసీకి టికెట్ దక్కడం అభినందనీయం. వివిధ పార్టీలకు అతీతంగా కాసానిని గెలిపించుకుందాం. అన్ని కులాల వారు కలిసి కారు గుర్తుకు ఓటు వేసేలా ప్రచారం నిర్వహిస్తాం. రాష్ట్రంలో 70 శాతం ఉన్న బీసీలు సత్తా చాటాల్సిన సమయం వచ్చింది.
– గణేశ్యాదవ్, బండ్లగూడ
చేవెళ్ల నుంచి పోటీ చేస్తున్న జ్ఞానేశ్వర్ను గెలిపించి మన బీసీల సత్తా ఏంటో చూపాలి. కొన్నేండ్ల తరబడి బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న కాసానిని గెలిపించాలి. మన జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ నాయకులు మనకు అవకాశాలు తక్కువగానే ఇస్తున్నారు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన జ్ఞానేశ్వర్ను గెలిపించుకుందాం.
– వెంకటయ్య, బీసీ రైతు, అయినాపూర్, దోమ మండలం
చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపు కోసం బీసీలంతా ఐక్యంగా నిలువాలి. బీసీల ఐక్యతను చాటి మన గౌరవం నిలువాలంటే తప్పకుండా కాసానిని గెలిపించి తీరాలి. అగ్రకులాల నాయకులు మన బీసీలను హేళన చేసి మాట్లాడుతున్న ఈ తరుణంలో వారికి మన ఓటుతోనే సరైన బుద్ధి చెప్పాలి.
– నర్సింహులు, బీసీ సెల్ దోమ మండల అధ్యక్షుడు, రాకొండ
పార్లమెంట్లో బీసీల గళం వినిపించాలంటే అది కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యం. చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్కు అన్ని వర్గాల ప్రజలు అండగా నిలవాలి. పదవులు, వ్యాపారాల కోసం పార్టీలు మారే మోసగాళ్లకు తగిన గుణపాఠం చెబుదాం. జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్కు పంపి, బీసీల గళం వినిపిద్దాం.
– మహేందర్ ముదిరాజ్, మియాపూర్
బడుగు, బలహీన వర్గాల పక్షాన నిరంతరాయంగా కొట్లాడుతున్న బీసీ నేత, బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించి, గులాబీ జెండాను ఎగరేద్దాం. బీఆర్ఎస్ అడ్డాగా ఉన్న చేవెళ్లలో ముచ్చటగా మూడోసారి గెలిపించి, అధినేత కేసీఆర్కు కానుకగా అందిద్దాం. అమలుకు సాధ్యంకాని హామీలను నమ్మి మరోసారి మోసపోయేందుకు బీసీ, మైనార్టీలు సిద్ధంగా లేరని చాటిచెబుదాం.
– మహమ్మద్ ఖాసీం, కొండాపూర్