Test Rankings : యాషెస్ సిరీస్(Ashes Series)లో హోరాహోరీగా తలపడిన ఇంగ్లండ్(England), ఆస్ట్రేలియా (Australia) జట్లకు భారీ భారీ షాక్ తగిలింది. టెస్టు చాంపియన్షిప్ ర్యాంకింగ్స్ (WTC Rankings)లో అగ్రస్థానానికి దూసుకెళ్లాలనుకున్న వాటి కల ఫలించలేదు. సిరీస్ డ్రా చేసుకున్నా కూడా ఇరుజట్లు టెస్టు ర్యాంకింగ్స్(Test Rankings)లో ముందడుగు వేయలేకపోయాయి. అందుకు కారణం ఏంటో తెలుసా…? ఓవల్(Oval) వేదికగా జరిగిన ఐదో టెస్టు.
అవును.. సిరీస్ డిసైడర్ అయిన ఆ మ్యాచ్లో స్లో ఓవర్ రేటు(slow over rate) బెన్ స్టోక్స్, ప్యాట్ కమిన్స్ బృందం కొంపముంచింది. దాంతో, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కీలకమైన టెస్టు చాంపియన్షిప్ పాయింట్లు కోల్పోయాయి. ఐసీసీ నియమాల ప్రకారం ఇరుజట్లకు ప్రతి స్లో ఓవర్కు ఒకటి చొప్పున డబ్ల్యూటీసీ పాయింట్లు(WTC Points) తగ్గించారు. అంతేకాదు ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 5 శాతం కోత కూడా పడింది. దాంతో, పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా మూడో స్థానంతో, ఇంగ్లండ్ ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాయి.
How the #WTC25 standings look after the Ashes sanctions 📈📉
✍: https://t.co/VGHNWYeMuh pic.twitter.com/rw4FvD7hh9
— ICC (@ICC) August 2, 2023
రెండు టెస్టుల సిరీస్లో శ్రీలంకను వైట్వాష్ చేసిన పాకిస్థాన్(Pakistan) 24 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. విండీస్పై 1-0తో టెస్టు సిరీస్ గెలిచిన భారత జట్టు(Team India) 16 పాయింట్లతో రెండో ర్యాంకులో ఉంది. టెస్టు చాంపియన్షిప్ 2023-25 సైకిల్లో గెలిచిన జట్టుకు 12 పాయింట్లు కేటాయిస్తారు. మ్యాచ్ డ్రా చేసుకుంటే 4 పాయింట్లు లభిస్తాయి. మ్యాచ్ ఓడితే ఒక్క పాయింట్ కూడా రాదు.
బెన్ స్టోక్స్ బృందం
ఓవల్ టెస్టు(Oval Test)లో ఆతిథ్య ఇంగ్లండ్ అనూహ్యంగా విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో 49 పరుగుల తేడాతో కంగారులను చిత్తు చేసింది. రెండో ఇన్నింగ్స్లో క్రిస్ వోక్స్(Chris Woakes) నాలుగు, మోయిన్ అలీ 3 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించారు. సంచలన బౌలింగ్తో జట్టును గెలిపించిన వోక్స్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నాడు. దాంతో, 2001 తర్వాత మళ్లీ ఇంగ్లండ్ గడ్డపై యాషెస్ సిరీస్ నెగ్గాలనుకున్న ఆస్ట్రేలియాకు నిరాశే మిగిలింది.