ODI Rankings : భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma)కు తాజా వన్డే ర్యాంకింగ్స్(ODI Rankings) లో షాక్ తగిలింది. వెస్టిండీస్తో రెండు వన్డేలకు దూరమైన ఈ ఇద్దరూ ఒక్కో స్థానం కోల్పోయారు. ఇంతకుముందు టాప్ 10లో హిట్మ్యాన్ 11 స్థానానికి, 8వ స్థానంలో ఉన్న కోహ్లీ 9వ ర్యాంక్కి పడిపోయారు. అయితే.. వెస్టిండీస్(West Indies)తో మూడు వన్డేల సిరీస్లో దుమ్మురేపిన ఇషాన్ కిషన్(Ishank Kishan), చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) అనూహ్యంగా తమ ర్యాంక్స్ మెరుగుపరుచుకున్నారు. బ్యాటర్లో ఇషాన్ 43వ ర్యాంక్, బౌలర్లలో కుల్దీప్ 14వ ర్యాంకు సొంతం చేసుకున్నారు.
విధ్వంసక ఓపెనర్ ఇషాన్ రెండో టెస్టు, మూడు వన్డేల్లో వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు కొట్టాడు. దాంతో ఈ లెఫ్ట్ హ్యాండర్ 14 స్థానాలు ఎగబాకి 45వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. కుల్దీప్ కూడా ఏకంగా 8 స్థానాలు మెరుగుపర్చుకొని 14 ర్యాంకులో నిలిచాడు. రెండో వన్డేలో తేలిపోయిన భారత కుర్రాళ్లు మూడో వన్డేలో అదరగొట్టారు. విండీస్ను 200 పరుగుల తేడాతో చిత్తు చేశారు.
ఇషాన్ కిషన్, సూర్య, హార్దిక్ పాండ్యా
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 351 రన్స్ కొట్టింది. ఇషాన్ కిషన్(77), శుభ్మన్ గిల్(85), సంజూ శాంసన్(51), హార్దిక్ పాండ్యా(70 నాటౌట్) అర్ధ శతకాలతో జట్టుకు భారీ స్కోర్ అందించారు. లక్ష్య ఛేదనలో ఆతిథ్య జట్టు 151 పరుగులకే కుప్పకూలింది. శార్దూల్ ఠాకూర్ 4, ముకేశ్ కుమార్ మూడు, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టారు. దాంతో, భారత జట్టు 2-1తో వన్డే సిరీస్ సొంతం చేసుకుంది.