భారత దేశవాళీ టోర్నమెంటు రంజీ ట్రోపీలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ మంత్రి మనోజ్ తివారీ బ్యాటుతో అదరగొట్టాడు. బెంగాల్ తరఫున ఆడిన అతను.. జార్ఖండ్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో చెలరేగాడు. 152 బంతులు ఎదుర్కొన్న అతను 14 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో సెంచరీ చేశాడు.
బెంగాల్ ప్రభుత్వంలో యువజన వ్యవహారాల శాఖ మంత్రిగా సేవలందిస్తున్న తివారీ.. రంజీల్లో పునరాగమనాన్ని అద్భుతంగా చాటుకున్నాడు. తనలో ఏమాత్రం సత్తా తగ్గలేదని నిరూపించుకున్నాడు. అతను అదరగొట్టడంతో బెంగాల్ జట్టు భారీ స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్లో కూడా తివారీ అర్థశతకంతో రాణించాడు.
రెండో ఇన్నింగ్స్లో బెంగాల్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. అలాంటి సమయంలో తివారీ జట్టును ఆదుకున్నాడు. 136 పరుగులు చేసిన అతను రనౌట్ అయ్యాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేసిన తివారీని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.