Ben Stokes : భారత పర్యటనను విజయంతో ప్రారంభించిన ఇంగ్లండ్(England) జట్టు వరుస ఓటములతో డీలా పడింది. రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారీ ఓటమిని స్టోక్స్ సేన జీర్ణించుకోలేకపోతోంది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ జట్టు ఏ దశలోనూ కనీస పోరాటం చేయలేదు. ఓటమి అనంతరం కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) ఓపెనర్ జాక్ క్రాలే ఎల్బీగా ఔటవ్వడంపై స్పందిస్తూ.. డీఆర్ఎస్లోని అంపైర్స్ కాల్ (Umpires Call)ను రద్దు చేయాలని అన్నాడు.
మ్యాచ్ తర్వాత తాను రిఫరీ జెఫ్ క్రొవేతో అతడు జాక్ క్రాలే ఎల్బీగా ఔటవ్వడం గురించి మాట్లాడాడు. బంతి స్టంప్స్కు తాకకున్నా అంపైర్స్ కాల్ ద్వారా క్రాలేను ఔటివ్వడాన్ని స్టోక్స్ తప్పుపట్టాడు. ‘భారత పిచ్లపై బంతి స్పిన్, బౌన్స్ అయినప్పుడు ఎల్బీ నిర్ణయం తీసుకోవడం అంపైరింగ్ కష్టమైన పనే.
❎ “The ball didn’t hit the stump on the replay. We should take away umpires call.”
📹 “When the people in charge of it are saying that something’s gone wrong, then that says enough.”
Ben Stokes chats to @cameronponsonby about the DRS decisions in their defeat 🏏 #INDvENG pic.twitter.com/89RWI4LT7Z
— talkSPORT Cricket (@Cricket_TS) February 18, 2024
అయితే.. బంతి వికెట్లకు తాకినప్పుడు మాత్రమే ఔట్ ఇవ్వాలి. లేదంటే లేదు. అందుకని డీఆర్ఎస్లో ఉన్న అంపైర్స్ కాల్ను తీసేయ్యాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ, నేను ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడను. ఎందుకంటే.. అంపైర్స్ కాల్ కారణంగానే మేము ఓడిపోయామని అందరూ అనుకుంటారు’ అని 32 ఏండ్ల స్టోక్స్ తెలిపాడు.
Both openers gone for England.
Crawley reviews the LBW decision but it’s Umpire’s Call and Dharmasena’s decision is not overturned.
Zak gives the umpire a piece of his mind as he storms off.
…and it’s Tea. England 18/2.
Day 5 no longer a guarantee! pic.twitter.com/lHwrUrxKRK
— 🏏Flashscore Cricket Commentators (@FlashCric) February 18, 2024
ఇంగ్లండ్ టెస్టు సారథిగా గొప్ప రికార్డు ఉన్న స్టోక్స్.. భారత పర్యటన మాత్రం పీడకలగా మారుతోంది. అతడి కెప్టెన్సీలో ఇంగ్లండ్ జట్టు వరుసగా రెండు టెస్టుల్లో ఓడిపోవడం ఇది రెండోసారంతే. తొలి ఇన్నింగ్స్లో బెన్ డకెట్(153) బజ్ బాల్ ఆటతో భారీ దిశగా పయనించిన ఇంగ్లండ్ మూడోరోజు అనూహ్యంగా కుప్పకూలింది. ఆ తర్వాత బౌలింగ్లోనూ ఆ జట్టు ఆకట్టుకోలేదు. స్టోక్స్ తొలి ఇన్నింగ్స్లో 41 రన్స్ చేసినా.. రెండు ఇన్నింగ్స్లో చేతులెత్తేశాడు. ఓలీ పోప్(3), జో రూట్(7), జానీ బెయిర్స్టో(4) వంటి స్టార్ ఆటగాళ్లంతా స్పిన్నర్ జడేజా దెబ్బకు రెండంకెల స్కోర్ చేయలేకపోయారు.
బెన్ స్టోక్స్
తొలి ఇన్నింగ్స్లో కెప్టెన్ రోహిత్ శర్మ(132), జడేజా(112) సెంచరీలతో కదం తొక్కగా.. రెండో ఇన్నింగ్స్లో కుర్ర ఓపెనర్ యశస్వీ జైస్వాల్(214 నాటౌట్) డబుల్ సెంచరీతో విజృంభించాడు. శుభ్మన్ గిల్(91), సర్ఫరాజ్ ఖాన్(68 నాటౌట్)లు దంచికొట్టడంతో ఇంగ్లండ్కు 556 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం జడేజా 5 వికెట్లు తీయడంతో భారత జట్టు 434 పరుగుల భారీ విజయం నమోదు చేసి సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరుజట్ల మధ్య ఫిబ్రవరి 23న రాంచీలో నాలుగో టెస్టు జరుగనుంది.