ముంబై: కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఈ యేటి ఐపీఎల్ టోర్నీ అర్ధాంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే మిగితా మ్యాచ్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో నిర్వహించనున్నట్లు ఇవాళ బీసీసీఐ వెల్లడించింది. సెప్టెంబర్-అక్టోబర్ లో ఇండియాలో వార్షాకాలం ఉంటుందని, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మిగితా ఐపీఎల్ మ్యాచ్లను యూఏఈలో నిర్వహించనున్నట్లు తెలిపారు. వర్చువల్గా జరిగిన స్పెషల్ జనరల్ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఐపీఎల్ టోర్నీ నిర్వహణకు సభ్యులంతా ఏకగ్రీవంగా అంగీకరించినట్లు తెలిసింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నిర్వహణ విషయంలో మరింత అదనపు సమయాన్ని ఐసీసీని కోరేందుకు బీసీసీఐ నిర్ణయించినట్లు ఓ ప్రటకనలో తెలిపారు.