BCCI | భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రతిష్ఠాత్మక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. బీసీసీఐ నిర్వహించిన టీ 20 మ్యాచ్ను వీక్షించేందుకు అత్యధిక సంఖ్యలో అభిమానులు హాజరైనందుకు బీసీసీఐకు ఈ అవార్డు వరించింది.
ఐపీఎల్-2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. గత మే 29న జరిగిన ఈ మ్యాచ్ను వీక్షించేందుకు 1,01,566 మంది అభిమానులు హాజరయ్యారు. ఇప్పటివరకు ఇదే అత్యధిక హాజరు. ఈ రికార్డును గిన్నిస్ బుక్ యాజమాన్యం గుర్తించింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధి నుంచి బీసీసీఐ కార్యదర్శి జై షా ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ మేరకు ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న ఫొటోను అభిమానులతో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేసింది.
A proud moment for everyone as India creates the Guinness World Record. This one is for all our fans for their unmatched passion and unwavering support. Congratulations to @GCAMotera and @IPL pic.twitter.com/PPhalj4yjI
— BCCI (@BCCI) November 27, 2022