MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఐపీఎల్ కెరీర్పై చర్చ నడుస్తున్న సమయంలో అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్. మహీ భాయ్పై రూ.15 కోట్ల చీటింగ్ కేసు నమోదైంది. దాంతో, ఈ కేసుపై అభిప్రాయం తెలపాల్సిందిగా ఆదివారం భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) మహీ భాయ్ను కోరింది. బీసీసీఐకి చెందిన ఎథిక్స్ కమిటీ ధోనీకి ఆగస్టు 30వ తేదీ వరకూ గడువు విధించింది.
ఉత్తరప్రదేశ్లోని అమేథికి చెందిన రాజేశ్ కుమార్ మౌర్య అనే వ్యక్తి ధోనీ తనను రూ. 15 కోట్లు మోసగించాడని బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు. బీసీసీఐ ఎథిక్స్ కమిటీ నిబంధన 36 కింద ఆ కేసును రిజిష్టర్ చేసుకుంది. మిహిరా దివాకర్ అనే వ్యక్తిపై ధోనీ పెట్టిన రూ.15 కోట్ల స్కామ్ కేసుకు దీనికి సంబంధం ఉంది. దాంతో, మహీని రాజేశ్ కుమార్ నమోదు చేసిన ఫిర్యాదుపై స్పందించాల్సింది బీసీసీఐ కోరింది.
ధోనీ పేరుతో క్రికెట్ అకాడమీ నడిపేందుకు అర్క్రా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 2021లో మహీతో ఒప్పందం చేసుకుంది. అయితే.. అగ్రిమెంట్ ప్రకారం ధోనీకి రావాల్సిన డబ్బును అర్క్రా కంపెనీ యజమాని సౌమ్యా దాస్ (Soumya Das) ఇవ్వలేదు. భారత మాజీ సారథికి అతడు దాదాపు రూ.15 కోట్లు టోకరా వేశాడు. దాంతో, ధోనీ రాంచీ సివిల్ కోర్టులో సౌమ్యాపై కేసు వేశాడు. ఇప్పుడు రాజేశ్ కుమార్ ధోనీనే తమను మోసం చేశాడంటూ బీసీసీఐకి ఫిర్యాదు చేయడం గమనార్హం.
ఐపీఎల్ 17వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన ధోనీ ఫినిషర్గా అదరగొట్టాడు. అయితే.. ఐపీఎల్కు వీడ్కోలు పలుకుతాడనే వార్తల నేపథ్యంలో 18వ సీజన్లో మహీ ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది ఐపీఎల్ మెగా వేలం ఉంది. అందుకని ధోనీని అన్క్యాప్డ్ ప్లేయర్గా కొనసాగించాలా? అనే విషయమై సీఎస్కే యాజమాన్యం తర్జనభర్జన పడుతోంది.