BCCI : భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ మాఫియా, అవినీతి కేసులకు ఇక శుభం కార్డు పడనుంది. అవును.. దేశవాళీ, సీనియర్ స్థాయిలో అవినీతిని రూపుమాపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. విశ్రాంత ఐపీఎస్ అధికారి శరద్ కుమార్ (Sharad Kumar)ను అవినీతి నిరోధక విభాగానికి కొత్త అధిపతిగా నియమించింది.
ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ అధిపతిగా ఉన్న ఐపీఎస్ కేకే మిశ్రా పదవీ కాలం ముగిసింది. దాంతో, మిశ్రా స్థానంలో శరద్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. సెప్టెంబర్ 29న బెంగళూరులో జరిగిన బీసీసీఐ వార్షిక సమావేశంలోనే యాంటీ కరప్షన్ విభాగం హెడ్గా శరద్ పేరు ఖరారు చేశారని సమాచారం.
శరద్ కుమార్
హర్యానా కేడర్కు చెందిన శరద్ కుమార్ ఐపీఎస్గా పలు హోదాల్లో పనిచేశారు. శరద్కు అతిపెద్ద ఆర్ధిక నేరాలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేసిన అనుభవం ఉంది. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)కు 2013 నుంచి 2017 వరకూ.. నాలుగేండ్లు బాస్గా సేవలందించిన శరద్ కుమార్ ఆ తర్వాత కేంద్ర నిఘా సంస్థలో కమిషనర్గానూ పనిచేశారు. ఇప్పుడు బీసీసీఐ పరిధిలో అవినీతి భూతాన్ని తరిమికొట్టనున్నాడు. ముఖ్యంగా మ్యాచ్ ఫిక్సింగ్ నేరాలపై, బెట్టింగ్ ముఠాలపై, లెక్క చూపని లావాదేవీలపై ఆయన దృష్టి సారించే అవకాశముంది.