WPL 2024 : మహిళల క్రికెట్కు విశ్వఖ్యాతి తీసుకొచ్చిన మహిళల ప్రీమియర్ లీగ్(WPL) రెండో సీజన్కు కౌంట్డౌన్ మొదలైంది. ఈ మెగా టోర్నీని ఫిబ్రవరిలో నిర్వహిస్తారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ (BCCI) అధికారక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 23న టోర్నీ షురూ అవుతుందని తెలిపింది. అదే రోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్ నిర్వహించనున్నారు.
ఆరంభ పోరులో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్(Mumbai Indians), రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తలపడనున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్, యూపీ వారియర్స్ జట్ల మధ్య ఫిబ్రవరి 24న రెండో మ్యాచ్ జరుగునుంది. మార్చి 15న ఎలిమినేటర్ పోరు.. మార్చి 17న ఫైనల్ నిర్వహించనున్నారు.
తొలి సీజన్లో ముంబైకే పరిమితమైన డబ్ల్యూపీఎల్.. రెండో సీజన్లో రెండు నగరాల్లో జరుగనుంది. ఐదు జట్లు బెంగళూరు, ఢిల్లీ వేదికగా 22మ్యాచ్లు ఆడనున్నాయి. అత్యధికంగా బెంగళూరులో 11 మ్యాచ్లు నిర్వహించనున్నారు. మార్చి 4 తర్వాత టోర్నీ మొత్తానికి ఢీల్లీ ఆతిథ్యం ఇవ్వనుంది.
డబ్ల్యూపీఎల్ ట్రోఫీతో హర్మన్ప్రీత్ కౌర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సక్సెస్ కావడంతో మహిళలకు ఓ టీ20 లీగ్ ఉంటే బాగుంటుందని బీసీసీఐ తొలిసారి మహిళల ప్రీమియర్ లీగ్కు నిరుడు శ్రీకారం చుట్టింది. ఊహించినట్టుగా డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ క్రీడాభిమానులను ఎంతగానో అలరించింది. ముంబై వేదికగా జరిగిన ఈ టోర్నీలో.. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు టైటిలో కోసం పోటీ పడ్డాయి. లీగ్ దశ నుంచి అదరగొట్టిన ముంబై, ఢిల్లీ టైటిల్ పోరులో తలపడ్డాయి. అయితే.. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై చాంపియిన్గా అవతరించింది.