Heart Attack | హైదరాబాద్ : డీసీపీ వెంకటేశ్వర్లు కుమారుడు చంద్రతేజ్(20) గుండెపోటుతో మృతి చెందాడు. చంద్రతేజ్కు సోమవారం రాత్రి గుండెపోటు వచ్చింది. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చంద్రతేజ్ ప్రాణాలు కోల్పోయాడు. చంద్రతేజ్ ఓ ప్రయివేటు కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎన్నికల సమయంలో వెంకటేశ్వర్లుపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రస్తుతం ఆయన కుందన్బాగ్లో నివాసం ఉంటున్నారు.