న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం వచ్చే నెల ఇంగ్లండ్లో పర్యటించనున్న భారత మహిళల జట్లను శుక్రవారం ప్రకటించారు. సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న ఈ టూర్లో మన అమ్మాయిలు 3 టీ20లు, మూడు వన్డేలు ఆడనున్నారు. ప్రపంచకప్ అనంతరం జట్టుకు దూరమైన వెటరన్ పేసర్ జులన్ గోస్వామిని వన్డే జట్టుకు ఎంపిక చేయగా.. మహిళల టీ20 చాలెంజ్లో మెరుపు బ్యాటింగ్తో ఆకట్టుకున్న కిరణ్ నవగిరెకు తొలిసారి జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. నవగిరె టీ20 జట్టులో చోటు దక్కించుకుంది. వన్డే ప్రపంచకప్ అనంతరం జులన్ గోస్వామి ఆడనున్న సిరీస్ ఇదే కానుండగా.. తెలుగమ్మాయి సబ్బినేని మేఘన వన్డే, టీ20 జట్లలో చోటు నిలుపుకుంది.
టీ20 జట్టు: హర్మన్ప్రీత్ (కెప్టెన్), స్మృతి, షఫాలీ, దీప్తి, పూజ, జెమీమా, స్నేహ్ రాణా, రేణుక, మేఘన సింగ్, రాధ, సబ్బినేని మేఘన, తానియా, రాజేశ్వరి, హేమలత, సిమ్రన్, రిచ, నవగిరె.
వన్డే జట్టు: హర్మన్ప్రీత్ (కెప్టెన్), స్మృతి, షఫాలీ, సబ్బినేని మేఘన, దీప్తి, తానియా, యస్తిక, పూజ, స్నేహ్ రాణా, రేణుక, మేఘన సింగ్, రాజేశ్వరి, హర్లీన్, హేమలత, సిమ్రన్, జులన్ గోస్వామి, జెమీమా.