ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా.. ఈ సిరీస్ పూర్తవగానే జింబాబ్వే పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ మూడు వన్డేలు ఆడుతుంది. ఈ క్రమంలో విండీస్ పర్యటనలో విశ్రాంతి ఇచ్చిన కోహ్లీని జింబాబ్వే పంపుతారని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఫామ్ లేమితో తడబడుతున్న కోహ్లీ.. జింబాబ్వేలో సెంచరీ చేస్తే అయినా మళ్లీ పూర్వ ఫామ్ అందుకుంటాడని కొందరు వాదించారు.
అయితే అనూహ్యంగా జింబాబ్వే పర్యటనకు కూడా బీసీసీఐ అతన్ని ఎంపిక చేయలేదు. రోహిత్, బుమ్రా, జడేజా వంటి వెటరన్లకు కూడా విశ్రాంతినిచ్చింది. జింబాబ్వే వన్డేల్లో కూడా భారత జట్టుకు శిఖర్ ధావనే సారధ్యం వహించనున్నాడు.
భారత జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠీ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ఆవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ దీపక్ చాహర్
#TeamIndia for 3 ODIs against Zimbabwe: Shikhar Dhawan (Capt), Ruturaj Gaikwad, Shubman Gill, Deepak Hooda, Rahul Tripathi, Ishan Kishan (wk), Sanju Samson (wk), Washington Sundar, Shardul Thakur, Kuldeep Yadav, Axar Patel, Avesh Khan, Prasidh Krishna, Mohd Siraj, Deepak Chahar.
— BCCI (@BCCI) July 30, 2022