BCCI : సొంతగడ్డపై ఇంగ్లండ్ లయన్స్తో జరుగుతున్న సిరీస్ ఆఖరి రెండు మ్యాచ్లకు బీసీసీఐ(BCCI) భారత ఏ స్క్వాడ్ను ఎంపిక చేసింది. దక్షిణాఫ్రికా పర్యటనలో రాణించిన యువ కెరటాలు అర్ష్దీప్ సింగ్(Arshdeep Singh), రింకూ సింగ్(Rinku Singh), తిలక్ వర్మ(Tilak Varma)లకు సెలెక్టర్లు చోటిచ్చారు. కుమార్ కుషగ్ర, ఉపేంద్ర యాదవ్లు వికెట్ కీపర్లుగా ఎంపికయ్యారు. అహ్మదాబాద్ స్టేడియంలో జనవరి 24న 2వ మ్యాచ్ మొదలవ్వనుంది. ఇదే స్టేడియంలో ఫిబ్రవరి 1న మొదటి మ్యాచ్ జరుగనుంది.
భారత ఏ జట్టు స్క్వాడ్ రెండో మ్యాచ్ : అభిమన్యు ఈశ్వరన్(కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, తిలక్ వర్మ, కుమార్ కుషగ్ర(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్, అర్ష్దీప్ సింగ్, తుషార్ దేశ్పాండే, విద్వత్ కవెరప్ప, ఉపేంద్ర యాదవ్(వికెట్ కీపర్), ఆకాశ్ దీప్, యశ్ దయాల్.
🚨 NEWS 🚨
India ‘A’ squad for second and third multi-day matches against England Lions announced.
Details 🔽https://t.co/h06xlQCyP5
— BCCI (@BCCI) January 19, 2024
భారత ఏ జట్టు స్క్వాడ్ మూడో మ్యాచ్ : అభిమన్యు ఈశ్వరన్(కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, తిలక్ వర్మ, రింకూ సింగ్, కుమార్ కుషగ్ర, వాషింగ్టన్ సుందర్, షామ్స్ ములాని, అర్ష్దీప్ సింగ్, తుషార్ దేశ్పాండే, విద్వత్ కవెరప్ప, ఉపేంద్ర యాదవ్, ఆకాశ్ దీప్, యశ్ దయాల్.
అహ్మాదాబాద్లో జరుగుతున్న తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ లయన్స్ తొలి ఇన్నింగ్స్ను 553 పరుగులకు డిక్లేర్ చేసింది. అనంతరం రజత్ పాటిదార్(151) సెంచరీ బాదడంతో భారత ఏ జట్టు 227 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ను లయన్స్ జట్టు 163 పరుగులకు డిక్లేర్ చేసింది. ప్రస్తుతం భారత జట్టు 223 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. శ్రీకర్ భరత్(4), మనవ్ సుతార్(12) ఆడుతున్నారు. మ్యాచ్ గెలవాలంటే మరో 267 పరుగులు కావాలి. కానీ, టెయిలెండర్లు ఏ మేరకు పోరాడతారు? అనేది చూడాలి.