మీర్పూర్: బంగ్లాదేశ్పై టీ20 సిరీస్ నెగ్గిన భారత మహిళల జట్టు.. వన్డే సిరీస్ను పరాజయంతో ప్రారంభించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత్ 40 పరుగలు తేడాతో ఓడింది. మహిళల వన్డేల్లో భారత్పై బంగ్లాదేశ్కు ఇదే తొలి విజయం. వర్షం కారణంగా డకవర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 44 ఓవర్లకు కుదించిన పోరులో మొదట బంగ్లాదేశ్ 43 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. మన బౌలర్లలో అమన్జ్యోత్ 4 వికెట్లు పడగొట్టింది. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో భారత్ 35.5 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. స్మృతి మందన (11), ప్రియా పునియా (10), యష్తిక భాటియా (15), హర్మన్ ప్రీత్ (5), జెమీమా రోడ్రిగ్స్ (10) విఫలమయ్యారు.