సిల్హెట్(బంగ్లాదేశ్): బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను శ్రీలంక కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఆఖరి పోరులో లంక 28 పరుగుల తేడాతో బంగ్లాపై విజయం సాధించింది. తొలుత లంక నిర్ణీత 20 ఓవర్లలో 174/7 స్కోరు చేసింది. కుశాల్ మెండిస్(86) అర్ధసెంచరీతో కదంతొక్కాడు.
తస్కిన్ అహ్మద్, రిషాద్ హుస్సేన్ రెండేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బంగ్లా..19.4 ఓవర్లలో 146 పరుగులకు పరిమితమైంది. నువాన్ తుషార (5/20) ఐదు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించాడు. రిషాద్ హుస్సేన్ (53) ఒక్కడే ఫర్వాలేదనిపించాడు. తుషారకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, కుశాల్ మెండిస్కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ దక్కింది.