T10 League : అబూదాబీ వేదికగా జరిగే టీ10 లీగ్(T10 League) ఎంత ఫేమసో తెలిసిందే. ఈ లీగ్లో అవినీతి జరిగినట్టు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) తాజాగా గుర్తించింది. రెండేళ్ల క్రితం ఈ లీగ్లో కరప్షన్కు పాల్పడిన ఎనిమిది మంది క్రికెటర్లు, ఒక మ్యాచ్ అధికారిపై చర్యలకు సిద్ధమైంది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ECB)పేరుతో ఐసీసీ ఈ తొమ్మిది మందిపై కేసు నమోదు చేసింది. వీళ్లలో బంగ్లాదేశ్ ఆల్రౌండర్ నసీర్ హొసేన్(Nasir Hossain) కూడా ఉన్నాడు.
టీ10 జట్ల సహ యజమానులైన కృష్ణన్ కుమార్ చౌదరీ( Krishan Kumar Chaudhary), పరాగ్ సంఘ్వీ, టీమ్ మేనేజర్ షాదాబ్ అహ్మద్, అసిస్టెంట్ కోచ్ సన్నీ ధిల్లాన్, బ్యటింగ్ కోచ్ అషర్ జైదీ, దేశావాళీ క్రికెటర్లు సలియా సమన్, రిజ్వాన్ జావేద్లపై ఐసీసీ కేసు పెట్టింది.
హొసేన్కు 2021 సీజన్ సందర్భంగా ఒక గిఫ్ట్ వచ్చింది. అయితే.. దాని గురించిన వివరాలను అతడు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు వెల్లడించలేదు. దాంతో, ఆర్టికల్ 2.4.3, ఆర్టికల్2.4.4, ఆర్టికల్ 2,4.6 కింద అతడిపై అవినీతి కేసు పెట్టారు. హొసేన్ 2017 నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడడం లేదు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో మాత్రమే ఆడుతున్నాడు. అతను ఢాకా ఫ్రాంచైజ్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు.