ఢాకా: బ్యాట్స్మెన్ సమిష్టికృషికి బౌలర్ల సహకారం తోడవడంతో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ 33 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 257 పరుగులు చేసింది. ముష్ఫికర్ (84), మహ్ముదుల్లా (54), తమీమ్ ఇక్బాల్ (52) అర్ధశతకాలు సాధించారు. లంక బౌలర్లలో ధనంజయకు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యఛేదనలో మెహదీ (4/30), ముస్తఫిజుర్ (3/34) ధాటికి లంక 48.1 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌటైంది. వణిండు హసరంగ (74) టాప్ స్కోరర్.