IND vs ENG : తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు బాజ్ బాల్(Bazz Ball) ఆటతో అదరగొట్టలేక చతికిలపడింది. లంచ్ తర్వాత స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత స్పిన్ త్రయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్లు చెలరేగడంతో 137 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఆలౌట్ ప్రమాదంలో పడిన జట్టును కెప్టెన్ బెన్ స్టోక్స్(9) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. యువ స్పిన్నర్ రెహాన్ అహ్మద్(2)తో కలిసి ఏడో వికెట్కు 5 పరుగులు జోడించాడు.
లంచ్ వరకు మూడు వికెట్లతో 108 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్ను అక్షర్ పటేల్ దెబ్బ తీశాడు. డేంజరస్ జానీ బెయిర్స్టో(37)ను సూపర్ డెలివరీతో బౌల్డ్ చేశాడు. ఆ కాసేపటికే జడేజా బౌలింగ్లో జో రూట్(29) స్వీప్ షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. అనంతరం కుర్రాడు బెన్ ఫోక్స్(4)ను అక్షర్ వెనక్కి పంపాడు. దాంతో, ఇంగ్లండ్ ఆలౌట్ అంచున నిలిచింది.
Axar strikes again as Bharat takes a sharp catch – India are into the tail #INDvENG
▶️ https://t.co/ScJisUw7M1 pic.twitter.com/ZNIHJ2cjqY
— ESPNcricinfo (@ESPNcricinfo) January 25, 2024
లంచ్ సమయానికి 108 పరుగులు చేసింది. జో రూట్(18) క్రీజులో ఉన్నారు. అశ్విన్, జడ్డూ దెబ్బకు 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన జట్టును వీళ్లిద్దరూ ఆదుకున్నారు. ఆచితూచి ఆడుతూ నాలుగో వికెట్కు 77 బంతుల్లో 48 రన్స్ జోడించారు. తొలి సెషన్లో దూకుడుగా ఆడిన ఓపెనర్లు జాక్ క్రాలే(18), బెన్ డకెట్(35), ఓలీ పోప్(1)లు స్వల్ప స్కోర్కే వెనుదిరిగారు.