Joe Root : ప్రపంచంలోని ఫాబ్ 4లో ఒకడైన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్(Joe Root) టెస్టుల్లో మరో రికార్డు నెలకొల్పాడు. ఈసారి భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) పేరిట ఉన్న రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్లో అత్యధిక పరుగుల వీరుడిగా బ్యాటర్గా అవతరించాడు.
ఉప్పల్ టెస్టుకు ముందు సచిన్ 2,535 రన్స్తో అగ్రస్థానంలో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్లో అక్షర్ పటేల్ బౌలింగ్లో బౌండరీ కొట్టిన రూట్.. మాస్లర్ బ్లాస్టర్ను దాటేశాడు. ప్రస్తుతం అతడు 2,555 పరుగులతో టాప్లో కొనసాగుతున్నాడు. 60 బంతుల్లో 29 రన్స్ చేసిన రూట్ను జడేజా ఔట్ చేశాడు.
Root sweeps, but top-edged to the fielder! #INDvENG
▶️ https://t.co/ScJisUw7M1 pic.twitter.com/nfXDkNGBLJ
— ESPNcricinfo (@ESPNcricinfo) January 25, 2024
భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్లో రూట్ 9 సెంచరీలతో టాప్లో ఉన్నాడు. ఇంగ్లండ్పై 51,73 సగటుతో 7 సెంచరీలు బాదిన సచిన్ 2,535 రన్స్తో రెండో స్థానంలో నిలిచాడు. భారత లెజెండ్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) నాలుగు సెంచరీలతో 2,483 పరుగులతో మూడో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ మాజీ సారథి అలెస్టర్ కుక్(Alastair Cook) నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. భారత్పై మెరుగైన రికార్డు ఉన్న కుక్ 47.66 సగటుతో 2,431 రన్స్ కొట్టాడు.